ప్రజాసేవకు పుష్కరాలు మంచి అవకాశం:బాబు
Published Thursday, 4 August 2016విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో ప్రభుత్వ ఉద్యోగులంతా అంకితభావంతో, సమర్ధతతో పనిచేయాలని, ప్రజాసేవకు ఇదొక అరుదైన అవకాశమని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు, పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. రవాణా, పారిశుద్ధ్యం, మంచినీరు, భోజన సదుపాయాలు తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదన్నారు. సంచార వైద్యశాలలు, సంచార మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు.