రౌడీయిజంపై ఉక్కుపాదం: ఎస్పీ
Published Thursday, 4 August 2016మందస, ఆగస్టు 4: భూదందాలు, రౌడీయిజం చేస్తే ఉక్కుపాదంతో అణగదొక్కుతామని జిల్లా ఎస్పీ బ్రహ్మరెడ్డి హెచ్చరించారు. గురువారం మందస పోలీసుస్టేషన్ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలోని మావోయిస్టుల ప్రభావం లేదని, ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒడిశా, గిరిజన గ్రామాలు అనించి ఉండడంతో సారా అమ్మకాల కేంద్రాలు ఉన్నాయన్నారు. వాటిని నివారించేందుకు చర్యలు చేపడతామన్నారు. జాతీయ రహదారి మీదుగా వాహనాలు అతి వేగంగా నడపడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, మలుపులు వద్ద సూచికలు, 24 గంటలు పోలీసు పెట్రోలింగ్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రజలతో పోలీసులు మమేకమై పోలీసుస్టేషన్లో మర్వాదపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. మందసలోని పోలీసుల వసతిగృహాలు కోసం రెండెకరాలు స్థలాన్ని మంజూరు చేయాలని కలెక్టర్కు, ఐటిడిఎ పివో దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం నిరంతరం పనిచేస్తున్నారన్నారు. ఈయనతోపాటు సిఐలు సూరినాయుడు, అవతారం, ఎస్ఐ రవివర్మలున్నారు.