S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజలను మోసం చేస్తున్న టిడిపి, బిజెపి

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 4: విభజన నేపథ్యంలో యుపిఎ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రకటించిన హోదాతో పాటు అనేక అంశాలపై తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి విమర్శించారు. గురువారం రాష్టవ్య్రాప్త నిరసనల్లో భాగంగా స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్ నుండి పాత బస్టాండ్ పొట్టి శ్రీరాముల కూడలి వరకు కళ్లకు గంతలు కట్టుకొని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరజీవి విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత యుపిఎ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు అంటే కాదుకాదు పదేళ్లు కావాలని అప్పటి ప్రతిపక్ష నేత, నేటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, జైట్లీలు మాటమార్చి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేయలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆనాడు చట్టం చేయలేదని చెబుతున్న నేతలు మరి ఎందుకు సభ సాక్షిగా పదేళ్లు కావాలని పట్టుబట్టారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు డోల జగన్మోహనరావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చౌదరి సతీష్, ఎఐసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లి రామ్మోహనరావు, ఎఐసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి రత్నాల నర్శింహమూర్తి, ఎం.ఎ.బేగ్, నంబాళ్ల రాజశేఖర్, గంజి ఆర్ ఎజ్రా, పుట్టా అంజనీకుమార్ పాల్గొన్నారు.