రైతు కుటుంబానికి 5లక్షల సాయం
Published Thursday, 4 August 2016ముస్తాబాద్, ఆగస్టు 4: ముస్తాబాద్లో గత యేడు అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యవసాయరైతు అనమేని యాదగిరి బాధిత కుటుంబానికి ప్రభుత్వం 5లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసిందని గురువారం సర్పంచ్ నల్ల నర్సయ్య చెప్పారు. శుక్రవారం తహశీల్ కార్యాలయంలో మృతుడి భార్యకు 5లక్షల చెక్కు అందజేయనున్నట్లుగా తెలిపారు.