ప్రత్యేక హోదా బిల్లుకు బిజెపి సహకరించాలి
Published Friday, 5 August 2016మంగళగిరి, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఓటింగ్ జరిగితే తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు సహకరించి ఆమోదింప జేయాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జలీల్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. జిఎస్టి బిల్లు ఆమోదించిన మాదిరిగానే ప్రత్యేక హోదా బిల్లును కూడా ఏకగ్రీవంగా రాజ్యసభలో ఆమోదించాలని జలీల్ కోరారు. ప్రత్యేక హోదాకు సహకరించకుంటే రాష్ట్రంలో బిజెపికి పుట్టగతులుండవని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ
గుంటూరు, ఆగస్టు 4: స్థానిక రైలుపేటలోని విజ్డమ్ స్కూలు ఆధ్వర్యంలో గురువారం పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్కూలు డైరెక్టర్ ఎస్వి రమణ రవిబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకానికి నడుంబిగించనప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్య పడుతుందన్నారు. అనంతరం పేడ్లగావో - దేశ్ బచావో తదితర నినాదాలతో ప్లకార్డులు ధరించి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శారదా, ఉపాధ్యాయులు కె వెంకటేశ్వరరావు, ఎ వెంకటలక్ష్మి, స్వామినాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.