స్ర్తి అక్షరాస్యతతోనే సమాజాభివృద్ధి
Published Friday, 5 August 2016అచ్చంపేట, ఆగస్టు 4: స్ర్తి అక్షరాస్యతతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎస్ వెంకయ్య అన్నారు. కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల లో గురువారం జరిగిన ఎస్ఎంసి మొ దటి సమావేశానికి ఆయన జెడ్పీటీసీ ఎన్ వెంకటేశ్వరరావు, పివి రామారావు, ఆర్ విశే్వశ్వరరావు, ఆశీర్వాదంతో కలిసి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. సమావేశానికి ఎస్ఎంసి చైర్మన్ యెనిగండ్ల విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. పాఠశాలలో నెలకొనివున్న సమస్యలపై ఎస్ఎంసి ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశం బాలికల ఉన్నత చదువుల కోసం ఇంటర్, డిగ్రీ బాలికల గురుకుల కళాశాలలు స్థాపించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో ఎండిఒ డిజి నాయక్, ఆశ్రమ పాఠశాల పర్యవేక్షకురాలు లక్ష్మి, బాజి, బి కోటేశ్వరరావు, వెంకాయమ్మ, ఉషారాణి, వైస్ చైర్మన్ మరియమ్మ తదితరులున్నారు.