ఆన్లైన్లో శ్రీవారి సేవా టికెట్లు
Published Friday, 5 August 2016తిరుమల:ఇకపై 90 రోజులు ముందుగానే శ్రీవారి సేవా టికెట్లను అందజేయనున్నట్లు, ఆన్లైన్లో సేవా టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు శుక్రవారం ఉదయం తెలిపారు. నమూనా ఆలయంలో ఉదయం7 నుంచి 9వరకు భక్తులకు అనుమతి ఇస్తున్నామన్నారు. రాగి డాలర్లను నమూనా ఆలయం వద్ద విక్రయిస్తామని చెప్పారు. 40కోట్లతో బర్డ్ ఆస్పత్రిని అభివృద్ధి చేయనున్నట్లు ఈవో ప్రకటించారు.