స్పీకర్, కేంద్రమంత్రులకు బాబు ఆహ్వానం
Published Friday, 5 August 2016దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న ఎపి సిఎం చంద్రబాబు ఈరోజు ఉదయం కేంద్రమంత్రులు అనంత్కుమార్, ప్రకాష్ జవదేకర్, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్లను కలిశారు. కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా వారిని ఆయన ఆహ్వానించారు. కాసేపట్లో ప్రధాని మోదీని చంద్రబాబు కలిసి పుష్కరాలకు ఆహ్వానిస్తారు. ఇదే సందర్భంగా ఎపికి ప్రత్యేక హోదా, కేంద్రం నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం వంటి అంశాలను ఆయన మోదీతో ప్రస్తావించే అవకాశం ఉంది.