హోదా ఇవ్వడానికి చట్టం అక్కర్లేదు
Published Friday, 5 August 2016ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లుపై చర్చ పూర్తయిందని, కోరం లేక ఓటింగ్ వాయిదా పడిందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ శుక్రవారం చెప్పారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎప్పుడూ ద్రవ్య బిల్లు కాదని, ఈ విషయంలో బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి చట్టం అక్కర్లేదని అన్నారు. బిల్లుకు మద్దతిచ్చిన 11 పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.