శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ
Published Friday, 5 August 2016శ్రీశైలం: భారీగా వరదనీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 835 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 2,61,212 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 16,732 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్కు 16,732 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.