నేర్చుకుందాం
Published Friday, 5 August 2016క. వీరైలులుఁ బౌరవులను
భారతులును గౌరవులును బాండవులు ననన్
వీరులయి పరఁగి రిది నయ పారగ
భవదీయ వంశ పరిపాటి మహిన్
వీరు బలులనీ, పౌరవులనీ, భారతులనీ, కౌరవులనీ, పాండవులనీ పిలువబడుతూ వీరులుగా ప్రసిద్ధి చెందారు. ఓ నయకోవిదుడా ఇది లోకంలో వాసికెక్కిన నీ వంశక్రమం అని జనమేజయునితో వైశంపాయనుడు చెప్పాడు.
క. నరవరుఁడగు శంతనున క
మరనదికిని నట్లు సంగమం బయ్యె మహా
పురుషుండు భీష్ముఁ డెట్ల
య్యిరువురకును బుట్టె ? దీని నెఱిఁగింపు మొగిన్
భావం: ఉత్తముడైన శంతనుడికీ గంగకూ పొతుంత ఏవిధంగా కలిగింది? వారిరువురికీ మహాత్ముడైన భీష్ముడు ఏవిధంగా పుట్టాడు? ఈ వృత్తాంతాన్ని అంతా నాకు తెలుపుము అని జనమేజయ మహారాజు వైశంపాయనుణ్ణి అర్థించాడు.
శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము