2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని ర్యాలీ
Published Friday, 5 August 2016కొండపాక, ఆగస్టు 5: 123జిఓ వద్దని 2013చట్టమే ముద్దని ఎర్రవల్లి గ్రామస్తులు శుక్రవారం ర్యాలీ తీశారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లిలో చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. గ్రామంలో ర్యాలీ నిర్వహించి 2013చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని నినాదాలు చేశారు. తమకు సరైన న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామన్నారు.