కర్నూలు-మంత్రాలయం రైల్వేలైన్ పునరుద్ధరించాలి
Published Friday, 5 August 2016ఎమ్మిగనూరు, ఆగస్టు 4: దీర్గ కాలంగా పెండింగ్లో ఉన్న కర్నూలు - మంత్రాలయం రైల్వేలైన్ను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే డాక్టర్ బివి.జయనాగేశ్వర రెడ్డి, ఎంపిలు టిజి.వెంకటేష్, రాంమోహన్నాయుడు గురువారం ఢిలీలో స్టేట్ రైల్వే ఇండిపెండెంట్ ఛార్జి మంత్రి రాహైన్ గోయల్కు గురువారం సాయంత్రం వినతిపత్రం సమర్పించిన్నట్లు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఢిల్లీ నుండి విలేఖర్లకు ఫోన్లో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా తండ్రి మాజీ మంత్రి బివి.మోహన్ రెడ్డి ఈ రైల్వేలైన్కు ఎంతో కృషి చేశారని, 10 సంవత్సరాల క్రితమే ఈ రైల్వే రైన్ సర్వేకు నిధులు కూడా మంజూరు చేయించారన్నారు. ఈ రైల్వే లైన్ వలన వ్యాపారుస్తులకు వ్యాపారం చేయుటకు, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.