చంద్రయ్య కాల్వలో యువకుడి గల్లంతు
Published Sunday, 25 September 2016గుడివాడ, సెప్టెంబర్ 24: ప్రమాదవశాత్తూ చంద్రయ్య కాల్వలో పడి యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పెదఎరుకపాడు వార్పు రోడ్డులో ఉంటున్న పఠాన్ బిస్మిలా ల(23) తాపీ కార్మికుడిగా పనిచేస్తున్నా డు. శుక్రవారం రాత్రి కార్మికనగర్లోని తల్లిదండ్రులు పఠాన్ మరదసా, నజీమాల ఇంటికి వచ్చి వెళ్తూ స్నేహితుడితో కలిసి చంద్రయ్య కాల్వ వద్ద మాట్లాడుతున్నాడు. ప్రమాదవశాత్తూ కాలు జారిన బిస్మిల్లా కాల్వలో పడిపోయాడు. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో బిస్మిల్లా కొట్టుకుపోయాడు. స్నేహితుడు శ్రీకాంత్ కాల్వలోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. శనివారం మధ్యాహ్నం వరకు చంద్రయ్య కాల్వ వెంబడి వెతికినా ఫలితం లేదు. గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.