దోమలపై దండయాత్ర
Published Sunday, 25 September 2016పటమట, సెప్టెంబర్ 24: పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఎమ్మెల్యే గద్దె అన్నారు. 12వ డివిజన్లో దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రతపై శనివారం జరిగిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుదల, ఔట్ ఫాల్ డ్రైయిన్లు, సైడ్ డ్రైయిన్లలో పూడికలను తొలిగించి, మురుగునీరు సక్రమంగా పారేందుకు కృషి చేయాలని అన్నారు. డ్రైయిన్లలో చెత్తా చెదారం వేయకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొత్త రమాదేవి, ముమ్మనేని ప్రసాద్, చలసాని రమణ తదితరులు పాల్గొన్నారు.