దండయాత్ర!
Published Sunday, 25 September 2016మునగపాక, సెప్టెంబర్ 24: ప్రాణాంతక వ్యాధులకు కారణమైన దోమల పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని యలమంచిలి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్బాబు పిలుపునిచ్చారు. మండలంలో గల నాగులాపల్లి పంచాయితీ దోమలపై దండోరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పంచకర్ల శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగులాపల్లి వీధుల్లో దోమలవల్ల కలిగే అనర్ధాలను అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా పంచాయితీ కార్యాలయంలో జరిగిన సదస్సులో పంచకర్ల మాట్లాడుతూ దోమల నివారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి కార్యచరణ చేపడుతుందని అన్నారు. ప్రతీ ఒక్కరూ దోమల నివారణను సామాజికి భాద్యతగా తీసుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విదంగా అవగాహన కల్పించాలని అన్నారు. దీనికి ముందు మునగపాక, తోటాడ పంచాయితీ గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యే అధికారి చంద్రశేఖర్, స్థానిక ఎంపిపి ఆడారి మంజు, మండల టిడిపి అధ్యక్షుడు దాడి ముసిలిఅప్పారావు, స్థానిక సర్పంచ్లు యల్లపు వెంకటభాస్కరావు, దాడి వీరమహాలక్ష్మీనాయుడు, తహశీల్ధార్ జి రాంబాబు, ఎంపిడివో శాంతలక్ష్మీ, బొద్దపు శ్రీరామమూర్తి, దొడ్డి పాలు శ్రీను, అన్ని శాఖల అధికారుల పాల్గొన్నారు.