ముంపు ప్రాంతాల్లో బాబు
Published Sunday, 25 September 2016గుంటూరు:పల్నాడులో వర్షాలు, వరదలకు నష్టపోయిన అందరినీ తక్షణం ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఆదివారం ఉదయం పల్నాడులోని గురజాల, నరసరావుపేట, పెదకూరపాడు, మాచర్ల, దాచేపల్లి ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఏరియల్ సర్వేలో వరద తీవ్రతను పరిశీలించారు. దాచేపల్లిలో బాధితులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను, అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. కూలిపోయిన విద్యుత్ స్తంభాలను రెండురోజుల్లోగా పునరుద్ధరించాలని సూచించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చూడాలని, ఈ విషయంలో ఫిర్యాదులు వస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.