సైన్యం సత్తా చూపిస్తాం
Published Sunday, 25 September 2016న్యూఢిల్లి:కాశ్మీర్లోని ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లను దేశం మరచిపోదని, దాడులకు పాల్పడినవారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం మన్కీబాత్లో భాగంగా రేడియోలో ఆయన ఉరీ సంఘటనపై మాట్లాడారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నవారిపై సైన్యం తగిన సమయంలో జవాబు చెబుతుందని, సత్తా చాటుతుందని, మన సైన్యం తెగువపై అందరూ నమ్మకముంచాలని ఆయన పిలుపునిచ్చారు.