కాశ్మీర్ ఎన్నటికీ మాదే : అమిత్షా
Published Sunday, 25 September 2016కోజికోడ్:కాశ్మీర్ ఎప్పటికీ భారత్లోనే ఉంటుందని, తమనుండి ఆ ప్రాంతాన్ని ఎవరూ విడదీయలేరని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా అన్నారు. కాశ్మీర్పై ఎవరు కలలుగన్నా అవి కల్లలే అవుతాయన్నారు. ఉరీ సంఘటనకు పాల్పడిన ఉగ్రవాదుల మూకను పెంచి పోషించినది పాకిస్తానేనని సూటిగా విమర్శించారు. ఉరీ సంఘటనకు బాధ్యులైన వారికి బుద్ధి చెప్పాల్సిందేనని అన్నారు. ఈ మేరకు బిజెపి తీర్మానం ఆమోదించింది. బిజెపి నేత దీన్దయార్ శతజయంతి సందర్భంగా కోజికోడ్లో జరుగుతున్న సమావేశాల ముగింపు కార్యక్రమంలో అమిత్షా మాట్లాడారు.