90 రోజులు ఉచిత డేటా
Published Monday, 26 September 2016![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/26b2_3.jpg?itok=dh8jxB1g)
హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఎయిర్ టెల్ సర్వీసస్ సంస్ధ 4జి డాటా ప్యాక్ను ప్రకటించింది. 90 రోజుల పాటు ఉచితంగా డాటా సేవలను అందిస్తామని ఎయిర్ టెల్ ఇండియా డైరెక్టర్ అజయ్ పూరి తెలిపారు. ఇప్పటికే ఉన్న కస్టమర్లు రూ.1495 చెల్లించిన వారికి మూడు నెలల పాటు ఈ సదుపాయం ఉంటుందన్నారు. కొత్త వినియోగదారులు మొదటి రీచార్జికి రూ.1494 చెల్లించాలన్నారు. 4జి హ్యాండ్సెట్లు ఉన్న వారికే ఈ సదుపాయం ఉంటుందన్నారు.