దీన్దయాళ్కు ఘన నివాళి
Published Monday, 26 September 2016మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 25: స్థానిక బిజెపి కార్యాలయంలో ఆదివారం భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు దీన్దయాళ్ ఉపాధ్యాయ శత జయంతిని ఘనంగా నిర్వహించారు. దీన్దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసంఘ్ బలోపేతానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం చిలకలపూడిలోని అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. బిజెపి పట్టణ అధ్యక్షులు తోట రంగనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పంతం వెంకట గజేంద్రరావు, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, చిలంకుర్తి పృధ్వీప్రసన్న, కరెడ్ల సుశీల, నూకల వెంకట శేషయ్య, మత్తి వెంకటేశ్వరరావు, హరికృష్ణ, కంభాల శంకరబాబు, చలమలశెట్టి రామకృష్ణ, దోవారి ధనలక్ష్మి, పద్మావతి, నరహరశెట్టి ప్రసాద్, కూనపరెడ్డి సుబ్బయ్య నాయుడు, ఆరేపల్లి లక్ష్మీపార్వతి, తదితరులు పాల్గొన్నారు.