జల‘సిరి’
Published Monday, 26 September 2016దేవరాపల్లి, సెప్టెంబర్ 25: దేవరాపల్లిలో శనివారం రాత్రి భారీ వర్షం పడింది. ఇటువంటి వర్షం ఈ ఏడాది ఎప్పుడు పడలేదని మండల ప్రజలు అనుకుటుంటున్నారు. శనివారం వర్ష ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో 1700 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. శనివారం రాత్రి 83 మిల్లీమీటర్లు వర్షం పడడంతో మరలా జలాశయంలో వరదనీరు వచ్చి చేరుతుంది. పినకోట, సమ్మెద గెడ్డల నుంచి వరదనీరు 2800 క్యూసెక్కులు వరదనీరు వచ్చి చేరడంతో అంతే నీటిని మూడు గేట్లు ద్వారా విడుదల చేసినట్లు జలాశయ డిఈఈ ఏ.సునీత తెలిపారు. రైవాడ జలాశయం అత్యధిక నీటిమట్టం 114 మీటర్లు కాగా ఆదివారం సాయంత్రానికి 113.50 మీటర్లు ఉంది. శారదానదిపై ఉన్న వంతెనకు ఎటువంటి ఇబ్బంది కలగపోవడంతో ప్రజలు రహదారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు.