హోదాకోసం దీక్షకు సిద్ధమా?
Published Monday, 26 September 2016ప్రత్తిపాడు, సెప్టెంబర్ 25: తాను చేసిన దీక్ష దొంగదో, లేక నిజాయితీతో చేసిందో సమాజానికి తెలియజేయడం కోసం ఇది వరకే ప్రకటించినట్లు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపడదామని నాతో మీరు, మీ కుమారుడు కూర్చోవాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఆదివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో సిఎం చంద్రబాబుకు రాసిన లేఖను ముద్రగడ మీడియాకు విడుదల చేశారు. మీరేమో నిప్పు..మీ కుమారుడు యువకుడు కనుక నిగ్గు తేల్చుకుందామంటూ ఆయన ఆ లేఖలో సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే..ఈ ఛాలెంజ్కు తలొగ్గమంటూ, దీక్ష తేదీని ప్రకటించమని ఆయన ఆ లేఖలో డిమాండు చేశారు.