భలే క్రేజ్!
Published Sunday, 30 October 2016ఇప్పుడొస్తున్న అగ్ర కథానాయకులు, అగ్ర దర్శకుల చిత్రాలకు నవతరం కథానాయికలే ప్రధాన ఆకర్షణ అవుతున్నారు. వెండితెరపై అడుగుపెడుతూనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వీరు భారీ చిత్రాలకు భలే బాక్సాఫీస్ని పెంచేస్తున్నారు. వీరిపైనే పరిశ్రమ దృష్టి. అలాంటి తారల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ‘అఆ’తో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ‘ప్రేమమ్’తో మరోసారి అడుగుముందుకేసింది. ప్రస్తుతం శర్వానంద్తో ‘శతమానం భవతీ’లోనూ కలిసి ఆడి పాడుతోంది. టాలీవుడ్లో నవతరం కథానాయికలకు కొదువే లేదు. సినిమా..సినిమాకు ఒక కొత్త కథానాయిక రంగ ప్రవేశం చేస్తుంది. ఇలా చేయడం వల్ల పాతతరం కథానాయికలు కనుమరుగు కాక తప్పడంలేదు. పరిశ్రమ కూడా కొత్తవారినే ప్రోత్సహిస్తోంది. అదే వాళ్ల విజయరహస్యం కూడా. మంచి అవకాశాలతో భలే క్రేజ్ని సొంతం చేసుకుంటూ అడుగులు వేస్తున్న అనుపమ పరమేశ్వరన్ త్వరలోనే అగ్ర కథానాయికల లిస్టులో చేరుతుందనడంలో ఆశ్చర్యం ఏమీలేదు.