ఎటిపి ఫైనల్స్లో సెమీస్ చేరిన జొకోవిచ్
Published Friday, 18 November 2016లండన్, నవంబర్ 17: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరుగుతున్న ఎటిపి ఫైనల్స్ టోర్నమెంట్లో ఇవాన్ లెండిల్ గ్రూప్ నుంచి బరిలోకి దిగి సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్ చేరాడు. మిలోస్ రోనిక్ను 7-6, 7-6 తేడాతో ఓడించిన అతనికి రెండో రౌండ్లో డేవిడ్ గోఫిన్ నుంచి వాకోవర్ లభించింది. ఆరోగ్య కారణాలతో గోఫిన్ పోటీ నుంచి వైదొలిగాడు. మూడో రౌండ్లో డామినిక్ థియేమ్పై 6-7, 6-0, 6-2 ఆధిక్యంతో ఓడించిన జొకోవిచ్ సెమీస్లో చోటు సంపాదించాడు. కాగా, ఇటీవలే ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన బ్రిటిష్ ఆటగాడు ఆండీ ముర్రే ఈ టోర్నీలో జాన్ మెకెన్రో గ్రూప్లో పోటీపడుతూ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశాడు. తొలి మ్యాచ్లో నిషికోరిని 6-7, 6-4, 6-4 తేడాతో ఓడించిన అతను రెండో మ్యాచ్లో మారిన్ సిలిక్ను 6-3, 6-2 తేడాతో చిత్తుచేశాడు.
చిత్రం.. జొకోవిచ్