లెఫ్టీలదే మెజారిటీ!
Published Friday, 18 November 2016విశాఖపట్నం: రెండో టెస్టు ఆడుతున్న 11 మంది ఇంగ్లాండ్ క్రికెటర్లలో ఏడుగురు ఎడమ చేతివాటం గలవారే. భారత్పై ఇంత మంది లెఫ్టీలతో ఇంగ్లాండ్ ఒక టెస్టు ఆడడం ఇదే మొదటిసారి. కెప్టెన్ అలిస్టర్ కుక్తోపాటు మోయిన్ అలీ, జాఫర్ అన్సారీ, జిమీ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, బెన్ డకెట్, బెన్ స్టోక్స్ లెఫ్టీలే. మైనారిటీకి పడిపోయిన రైట్ హ్యాండర్లు ఈ టెస్టులో నలుగురు, హసీబ్ హమీద్, జో రూట్, జానీ బెయిర్స్టో, అదిల్ రషీద్ రూపంలో ఉన్నారు.