టెస్టుల్లోనూ ఇక్కడే..
Published Friday, 18 November 2016విశాఖపట్నం: విశాఖలో వనే్డ ఇంటర్నేషనల్ కెరీర్ను ఆరంభించిన హర్యానా ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ టెస్టు ఫార్మాట్లోనూ ఇదే మైదానంలో అరంగేట్రం చేయడం విశేషం. న్యూజిలాండ్తో గత నెల జరిగిన మ్యాచ్తో అతని వనే్డ కెరీర్ మొదలైంది. భారత్ తరఫున ఈ విధంగా ఒకే మైదానంలో తమ తొలి వనే్డ, టెస్టు మ్యాచ్లు ఆడిన ఎనిమిదో క్రికెటర్గా జయంత్ గుర్తింపు పొందాడు. భారత్ తరఫున టెస్టు జట్టుకు ఎంపికైన 286వ ఆటగాడు అతను. భారత మాజీ కెప్టెన్ రవి శాస్ర్తీ అతనికి టెస్టు క్యాప్ అందచేశాడు.
చిత్రం.. టెస్టు క్యాప్ అందించిన తర్వాత జయంత్ యాదవ్తో కరచాలనం చేస్తున్న రవి శాస్ర్తీ