ఢిల్లీలో స్వల్ప భూకంపం
Published Friday, 18 November 2016న్యూఢిల్లీ, నవంబర్ 17: ఢిల్లీ-ఎన్సిఆర్, హర్యానాల్లో గురువారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో భూకపంపం కారణంగా వరుస ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప మూలకేంద్రం హర్యానాలోని బావల్కు ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా గుర్తించారు. భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతుల్లో ఈ ప్రకంపనలు మొదలైనట్టుగా చెబుతున్నారు. దాదాపుఓ నిముషం పాటు ఈ ప్రకంపనలు సంభవించాయని, దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ప్రజలు మాత్రం ఈ ప్రకంపనల గురించి ట్వీట్ చేశారు.