S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజావసరాలు గుర్తింపుకే జనచైతన్య యాత్ర

ముదినేపల్లి, నవంబర్ 17: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని, అలాగే గ్రామాల్లో వౌళిక వసతులను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు, స్వచ్ఛ్భారత్, స్వచ్ఛాంద్ర ప్రదేశ్‌లో భాగంగా ప్రజలను చైతన్యపరచేందుకే జనచైతన్య యాత్రలని ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు అన్నారు. ముదినేపల్లి మండలం ఊటుకూరు, వి రావిగుంట, వాడవల్లి గ్రామాల్లో గురువారం జన చైతన్య యాత్రలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ జనవరిలో నిర్వహించబోవు జన్మభూమి కార్యక్రమంలో అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు, దీపం కనెక్షన్‌లను పంపిణీ చేసేందుకు ఆర్థిక ఒడిదుడుగులు ఎన్ని ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకరణం బద్ధలై ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ముదినేపల్లిలో దివంగత గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ఓదార్చారు. ఎంపిపి పోసిన కుమారి, జెడ్పీటిసి భూపతి నాగ కళ్యాణి, మండల టిడిపి పార్టీ అధ్యక్షులు చళ్లగుళ్ల శోభనాద్రి చౌదరి, పార్టీ నాయకులు కొత్తూరి విఠల్ తదితరులు పాల్గొన్నారు.