రోబో-2 ఫస్ట్లుక్ వస్తోంది
Published Friday, 18 November 2016ఇండియాలోనే మొట్టమొదటిసారి మోడ్రన్ టెక్నాలజీతో రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇదే కాంబినేషన్లో రోబో చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న చిత్రం ‘2.0’. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారతీయ సినిమాలోనే భారీ బడ్జెట్తో, హైటెక్నికల్ వాల్యూస్తో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ‘2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్కుమార్ విలన్గా ఓ భిన్నమైన పాత్ర పోషిస్తుండగా, అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ను ఆదివారం ముంబాయిలోని యశ్రాజ్ స్టూడియోలో సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఇండియాలోనే ఫస్ట్ టైమ్ మోడ్రన్ టెక్నాలజీతో ఈ చిత్రం ఫస్ట్లుక్ను చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫస్ట్లుక్ రిలీజ్ కార్యక్రమాన్ని లైకా ప్రొడక్షన్స్ లైవ్ స్ట్రీమ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్, అక్షయ్కుమార్, అమీ జాక్సన్, సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్, డైరెక్టర్ శంకర్, నిర్మాత సుభాష్ కరణ్తో పాటు ‘2.0’ చిత్రం యూనిట్ సభ్యులంతా పాల్గొంటారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తారు.