S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టిడిపి హయాంలోనే రాష్ట్ర ప్రగతి

ఎ.కొండూరు, నవంబర్ 18:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ చెప్పారు. జన చైతన్య యాత్రలో భాగంగా మండలంలోని చీమలపాడు పాలకేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమేష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమెముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెడ్ ఉన్నప్పటకీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఎంతో పకడ్బందీగా అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కిందని చెప్పారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పర్చి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరగు పర్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. రైతు, డ్వాక్రా మహిళల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 24 వేల కోట్లరూపాయల రుణాలను మాఫీ చేసిన ఘతన చంద్రబాబుకే దక్కిందని చెప్పారు. ఏ ఒక్కపేదవానికి అన్యాయం జరుగకూడదన్న లక్ష్యంతో అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తున్నారని ఆమె తెలిపారు. పోలవరం కాలువ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చి కృష్ణాజిల్లాను సస్యశ్యామలం చేశారని చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధి చేసే క్రమంలో దేశవిదేశాల నుండి పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు ఆహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు అండగా ప్రతి కార్యకర్త నిలిచి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏర్రాకుల శ్రీనివాసరావు, తిరువూరు నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, మండల పార్టీ అధ్యక్షులు అలవాల రమేష్‌రెడ్డి, ఎంపిపి వాసం మునీయ్య, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి జరబల బిజారీ, పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, బెజవాడ శంకర్, సర్పంచ్ మోర్ల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.