భక్తులను ఆకర్షిస్తున్న శత చండీ రుద్ర హోమం
Published Saturday, 19 November 2016ఇంద్రకీలాద్రి, నవంబర్ 18: దుర్గమ్మ సన్నిధిలో అమ్మవారి భవానీ దీక్షల సందర్భంగా ఏర్పాటు చేసిన శత చండీ రుద్రహోమం దుర్గమ్మ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. శ్రీ మల్లిఖార్జున మహా మండపం పక్కనే హోమాన్ని దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు నియమ నిష్ఠలతో నిర్వహిస్తున్నారు. తొలి రోజున ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ ముఖ్య అతిథిగా విచ్చేశారు.