అక్రమ తవ్వకాల నిరోధానికి ప్రత్యేక బృందాలు
Published Saturday, 19 November 2016విజయనగరం, నవంబర్ 18: జిల్లాలో అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ తవ్వకాల నిరోధానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ కాళిదాసు తెలిపారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో మైనింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 22 మండలాల్లో ఇసుక రవాణాను నిరోధించేందుకు గనులశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులతో బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇసుక రీచ్ల నుంచి స్వంత గృహ నిర్మాణాలకు ఇసుక తీసుకెళ్లవచ్చని, అలా గాకుండా వ్యాపారపరంగా ఇసుక నిల్వలు ఉంచినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అదే విధంగా మైనింగ్ విషయంలో లైసెన్సులు మంజూరు చేసేటపుడు కూడా శానిటరీ ఇన్స్పెక్టర్, గనులశాఖ ఎడి, తహశీల్దార్ ఉమ్మడి తనిఖీతొ లైసెన్సులు జారీ చేయాలన్నారు. మైనింగ్ విషయంలో లైసెన్సులు జారీ చేసేటపుడు ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సాయిరాం సింగ్, ఆర్డీవో శ్రీనివాసమూర్తి, డిఎస్పీ ఎవి రమణ, పంచాయతీరాజ్ డిఇ వాసుదేవరావు పాల్గొన్నారు.