ధ్రువ వస్తున్నాడు
Published Saturday, 19 November 2016రామ్చరణ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ధ్రువ’. స్టైలిష్ ఎంటర్టైనర్గా హై బడ్జెట్, టెక్నికల్ విలువలతో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. రామ్చరణ్ పవర్ఫుల్ ఐపిఎస్ అధికారిగా కనిపించనున్నాడు. తమిళంలో సూపర్హిట్ అయిన ‘తనిఒరువన్’ చిత్రానికి రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా వుంది. త్వరలోనే ఆ కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 9న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సీనియర్ హీరో అరవింద్ స్వామి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:హిప్ హాప్ తమిజ, కెమెరా:పి.ఎస్.వినోద్, ఎడిటర్:నవీన్ నూలి, నిర్మాతలు:అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్, దర్శకత్వం:సురేందర్రెడ్డి.