కదళీ నివేదన
Published Sunday, 20 November 2016ఉత్తర భారత దేశంలో ‘్ఛట్’ పూజ ఓ సంప్రదాయం. నేపాల్ ప్రజలకు ఇది ముఖ్యమైన పండుగ. సూర్యభగవానుడిని ఆరాధించే వేడుక ఇది. సమస్త శుభాలూ కలుగచేయాలని కాంక్షిస్తూ ఇలా సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. నవంబర్ 15 నుంచి మూడు రోజుల పాటు ఈ పూజలు నిర్వహిస్తారు. నేపాల్లో మధేశీలకు ఇది అతి ముఖ్యమైన పండగ. ఉత్తరభారత దేశంలోనూ దీనిని పాటిస్తారు. గంగానదిలో సూర్యనమస్కారం చేసి అరటిపళ్ల గెలను సమర్పిస్తున్న ఓ హిందూమహిళను ఇక్కడ చూడొచ్చు.