S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టిడిపితోనే రాజకీయ చైతన్యం

కేసముద్రం, నవంబర్ 20: ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాతే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం వెల్లివిరిసిందని, టిడిపి ఆవిర్భావం తరువాతే సామాన్యులకు పదవులు చేరువయ్యాయని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కేసముద్రం మండల కేంద్రంలో టిడిపి సభ్యత్వ నమోదుపై మహబూబాబాద్ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపితో రాజకీయ జీవితం ఆరంభించి, అనేక పదవులు పొంది తమ రాజకీయ ప్రయోజనం కోసం కొందరు పార్టీ వీడినంతనే పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో టిడిపికి బలమైన పునాది ఉందని, కార్యకర్తల సంఖ్యా బలం కూడా ఇతర పార్టీలతో పోలిస్తే తమదే పెద్దరాజకీయ శక్తిగా ఉంటుందన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న తమ పార్టీని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరింత పటిష్టంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి ఆపద వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని కొనియాడారు. పార్టీలో పేద కార్యకర్తల పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్యతో పాటు వివాహం కోసం ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు ఉచితంగా ప్రమాద బీమా కల్పించిన తొలి రాజకీయ పార్టీగా ఘనత సాధించిందన్నారు.