S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇకపై పాత నోట్లతో విరాళాలు స్వీకరించం

షిర్డీ, నవంబర్ 20: రద్దయిన వెయ్యి, అయిదు వందల రూపాయల నోట్లను తమ విరాళాల స్వీకరణ కౌంటర్లలో తీసుకోవడం నిలిపివేసినట్లు మహారాష్టల్రోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఆదివారం ప్రకటించింది. ఈ నెల 8న కేంద్ర ప్రభుత్వం వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజునుంచి సాయిబాబా సంస్థాన్ ట్రస్టు రద్దయిన పాత నోట్లతో డొనేషన్లు తీసుకోవడాన్ని, అలాగే క్రెడిట్, డెబిట్ కార్డులతో లావాదేవీలను జరపడాన్ని అంగీకరించడం ప్రారంభించిందని ట్రస్ట్ చీఫ్ అకౌంటెంట్ బాబా సాహెబ్ ఘోర్పడే తెలిపారు. అయితే ఆలయ హుండీల్లో రద్దయిన నోట్లు వస్తున్నాయని, వాటిని జాతీయ బ్యాంకుల్లో జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.