ఒత్తిడి పూర్తిగా భారత్పైనే
Published Monday, 21 November 2016విశాఖపట్నం: ఇది పరిమిత ఓవర్ల క్రికెట్ కాదు కాబట్టి పరుగుల వేటలో వికెట్లు పారేసుకోవలసిన అవసరం లేదని, ఇంకా 8 వికెట్లు తమ గుప్పిట్లో ఉన్నాయని, నిలకడగా ఆడి స్కోరు సాధిస్తామని ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు. గెలుపు కోసం భారత జట్టు తొందరపడుతుంది కాబట్టి ఒత్తిడి పూర్తిగా వారిపైనే ఉంటుందని అన్నాడు. అయిదో రోజు ఫ్రెష్గా బ్యాటింగ్ ప్రారంభించి వికెట్ల వద్ద పాతుకుపోవడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. ఈ పిచ్ మీద ఒక్కో బంతి ఒక్కో విధంగా బౌన్స్ అవుతుందని, దీనిపై స్పిన్సర్లను ఎదుర్కోవడం ఛాలెంజ్గా అభివర్ణించాడు. ఫ్లాట్ పిచ్ల మీద బ్యాట్స్మెన్ కష్టపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.