నరుూం ఆక్రమించుకున్న ఆస్తులు వెనక్కి...
Published Monday, 21 November 2016హైదరాబాద్, నవంబర్ 20: గ్యాంగ్స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూం ప్రజలను బెదిరించి, బలవంతంగా బినామి పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు, ఇళ్ళ స్థలాలను తిరిగి బాధితులకు అప్పగించే అవకాశం ఉంది. నరుూం ఎన్కౌంటర్లో మృతి చెందిన తరువాత అతని ఆస్తులకు సంబంధించి నగదు, రికార్డులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్వాధీన పరచుకున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్స్టర్ నరుూం తమను బెదిరింపులకు గురిచేసి తక్కువ ధరలకు తమ భూములు, ఇళ్ల స్థలాలు లాక్కున్నాడని, తమ భూములు తమకు అప్పగించాలని నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో నరుూం బాధితులు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ జరిపారు. బాధితులకు కోర్టు ద్వారా ఎవరి ఆస్తులు వారికి అప్పగించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. త్వరలో న్యాయస్థానం ఆదేశాల మేరకు బాధితుల ఫిర్యాదులను పరిశీలించి ఆస్తులను అప్పగించనున్నట్టు ఓ సీనియర్ సిట్ అధికారి తెలిపారు.