హరిద్వార్ బిహెచ్ఇఎల్ యూనిట్ను సందర్శించిన తెలంగాణ జెన్కో బృందం
Published Monday, 21 November 2016హైదరాబాద్, నవంబర్ 20: కొత్తగూడెం ఏడవ థర్మల్ విద్యుత్ యూనిట్ నిర్మాణానికి అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు తెలంగాణ జెన్కో విద్యుత్ నిపుణుల బృందం హరిద్వార్ బిహెచ్ఇఎల్ యూనిట్ను సందర్శించింది. ఈ బృందంలో ప్రాజెక్టుల డైరెక్టర్ సి రాధా కృష్ణ, థర్మల్ విభాగం డైరెక్టర్ ఎం సచిదానందం, హైడల్ విభాగం డైరెక్టర్ సిహెచ్ వెంకటరాజాం, చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. టర్బైన్,జనరేటర్ తదితర పరికరాలను ఈ యూనిట్నుంచి సేకరించనున్నారు. బిహెచ్ఇఎల్ యాజమాన్యం, సాంకేతిక నిపుణులతోబృందం చర్చించినట్లు తెలంగాణ జెన్కో ప్రకటనలో తెలిపింది.