రెండు బైక్లు ఢీ
Published Monday, 21 November 2016ధారూర్, నవంబర్ 20: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, నలుగురు గాయాలపాలైన సంఘటన మర్పల్లి మండలం బల్కల్ గ్రామం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మర్పల్లి మండలం పట్లూర్ గ్రామానికి చెందిన నెల్లి సుధాకర్(28), మరో ఇద్దరు మెదక్ జిల్లా తంగడపల్లి వెళ్ళేందుకు ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. కర్ణాటక రాష్ట్రంలోని కుంచారం వెళ్ళేందుకు కోనాపురం నుండి సాయికుమార్ (30) శ్రీకాంత్, అనిల్ మరో ద్విచక్రవాహనంపై బయలుదేరారు. బిల్కల్ గ్రామం వద్ద వేగంగా ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో రెండు వాహనాల పెట్రోల్ ట్యాంకులు పగిలి మంటలు చెలరేగాయి. మంటల్లో నెల్లి సుధాకర్ సజీవదహనం కాగా, సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీకాంత్, అనిల్తో సహా మరో ఇద్దరికి తీవ్రగాయాలవడంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతదేహాలను మర్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.