కౌంటర్ దాఖలు చేయండి
Published Saturday, 3 December 2016హైదరాబాద్, డిసెంబర్ 2: ఆబ్కారీ విధానంలో పేర్కొన్న విధంగా మాదక ద్రవ్యాలు, మద్యం అలవాటును మాన్పించడానికి ఏర్పాటు చేయాల్సిన డి-ఎడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏమిటో వారం రోజులలో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీటిని ఏర్పాటు చేయడానికి అంగీకరించిందని, అదే మాదిరిగా తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ రాజ ఎలంగో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.