విమలక్క కార్యాలయం సీజ్
Published Saturday, 3 December 2016హైదరాబాద్, డిసెంబర్ 2: పాత కేసుకు సంబంధించి కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి పోలీసులు నగరంలోని దోమలగూడలోని ప్రజాగాయిని విమలక్క, ‘అరుణోదయ’ సాంస్కృతిక సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం సీజ్ చేశారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా స్థానిక చిక్కడపల్లి పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏమి జరుగుతోందో తెలియక స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సంఘటన వివరాల ప్రకారం.. ఓ కీలక కేసులో ఒక ముద్దాయిని తీసుకుని శుక్రవారం పోలీసులు నగరానికి చేరుకున్నారు. స్థానిక చిక్కడపల్లి పోలీసుస్టేషన్కు సమాచారం అందించటంతో ఏసిపి జె.నర్సయ్య నేతృత్వంలో సిఐ సుదర్శన్, ఎస్సై లవన్ బందోబస్తును సమీక్షించారు. సదరు ముద్దాయిని అరుణోదయ కార్యాలయంలోకి తీసుకెళ్లి సోదాలు నిర్వహించి కొంత గుర్తుతెలియని మెటీరియల్ను సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.