ఈ పళ్లు తింటే ధూమపానం బంద్
Published Saturday, 28 January 2017ఔను. ‘్ఫగ్’ అని పిలిచే ‘అత్తి పండ్లు’ తింటే పొగాకు వాడకంపై ఏవగింపు పెరుగుతుందట. ఇది నిజమేకూడా. అందుకే సిగరెట్లు తాగేవారు ఆ అలవాటు మానుకోవాలంటే ఈ పళ్లను తినమని వైద్యులు సూచిస్తారు. మధ్యప్రాచ్యం, ఆసియా దేశాల్లో పుట్టి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడుతున్న ఫిగ్ తియ్యటి గుజ్జుతో కూడిన పండు. వీటిని ఔషధ పరిశ్రమలో క్రీములు, లోషన్స్ తయారీకి వాడతారు. కాస్మొటిక్ పరిశ్రమలోనూ దీనిని ఉపయోగిస్తారు. వీటి ఆకులు, పళ్లు, కాండం అన్నీ ఉపయోగకరమైనవే.