చేపల తెర
Published Monday, 6 March 2017సముద్ర తీరాల్లో చేపలను పట్టే మత్స్యకారులు సాధారణంగా ఇసుక నేలలపైనే చేపలను ఎడబెడతారు. ఉప్పునీటిలో కొంతకాలం ఉంచి ఆ తరువాత ఎండబెట్టడం మామూలే. కానీ ఇసుక చేరి అవి పాడవుతుండటంతో మనం బట్టలు ఆరవేసినట్లు చేపలను తీగలకు కట్టి ఇలా ఎండబెడుతున్నారు. ముంబై తీరంలోని ఓ పల్లెలో ఇలాంటి మత్స్యతెరలు ఎక్కడికక్కడ కనిపిస్తాయి.