S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 21:36

అంబకతో అప్పుడు కృష్ణుడిట్లా చెప్పాడు. ఈ దనుజుడు తనకు వేయి బాహువులున్నాయని కండకావరంతో ఉన్నాడు. మత్తిల్లి ఉన్నాడు. ఎవరినీ లక్ష్యం చేయకుండా ఉన్నాడు. కాబట్టి నీవు జీవత్పుత్రవతివిగా ఉండాలనుకుంటే ఈ బాహువులు ఖండించి రెండు చేతులు మాత్రమే మిగిల్చి ఉంచుతాను వీడికి. ఇక అప్పుడు వీడికి అసుర భావం తొలగిపోతుంది. నీకు కూరిమి భక్తుడవుతాడు. ఇక ఎటువంటి ఆపదల పాలుకాడు. మదోద్రేకాలకు దూరంగా ఉంటాడు.

07/31/2016 - 21:32

అతడు తనని ఆట పట్టించడానికే అలా మాట్లాడుతున్నాడన్న సంగతి అర్థమైన అంజలి అతడివైపు కోపంగా చూసి అక్కడనుంచి లేచి వెళ్లిపోయింది.

07/31/2016 - 21:29

* మహాభారతంలో ‘బర్బరీకుని’ గురించి వివరించ ప్రార్థన.
- గంగాధర్, ఇరగవరం

07/31/2016 - 21:23

క. బలయుతులు మాటయిరువది
పలువురు నుతులుద్ధవిల్లి నానాదేశం
బులకుఁ బతులైరి మఱి వా
రలలోసంవరణుఁ డఖిల రాజ్యోన్నతుఁ డై

,
07/31/2016 - 21:20

మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్. అ ఆ సినిమా తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో సినిమా తీస్తాడనేది అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన త్రివిక్రమ్ తాజాగా నితిన్‌తో ‘అ.. ఆ’ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఏ హీరోతో సినిమా తీయాలి.. అని ఆలోచిస్తున్న త్రివిక్రమ్‌కి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని సమాచారం.

07/31/2016 - 21:17

సాయిధరమ్‌తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్‌పై సునీల్‌రెడ్డి దర్శకత్వంలోసి.రోహిణ్‌కుమార్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘తిక్క’. లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా హీరోయిన్స్‌గా నటించారు. ఎస్.ఎస్.్థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల హైదరాబాద్‌లో జరిగింది.

07/31/2016 - 21:16

చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఓ పాత్రకోసం సునీల్‌ని అడిగారు. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో సునీల్ ఈ సినిమా చేయడానికి బాధపడుతూనే కుదరదని చెప్పాడు. కానీ ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చిందట!!

07/31/2016 - 21:13

శ్రీదేవి తనయ జాహ్నవి మహేష్ బాబు కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోందని ఆమధ్య వినిపించిన వార్త. ఇందులో నిజం ఎంత ఉందని ఆరాతీస్తే, తానిప్పుడే సినిమాల్లో నటించడానికి సిద్ధంగా లేనని జాహ్నవి చెప్పేసింది.

07/31/2016 - 21:10

చన్నాంబిక ఫిలిమ్స్ పతాకంపై మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవగౌడ మనుమడు నిఖిల్‌కుమార్ కథానాయకుడుగా ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనిత కుమారస్వామి రూపొందిస్తున్న చిత్రం జాగ్వార్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

07/31/2016 - 21:10

పూవు నేల రాలినప్పుడు
పరిమళం గాయపడటం చూశావా!

కాల్లో విరిగిన తుమ్మ ముల్లు
సలపరించడాన్ని భరించావా!

గాలి కూడా వౌనంగా
మనసుల్ని దాటిపోవడం విన్నావా!

కొడవలిని చూసి ఉలిక్కిపడ్డ
కంకి బెదురు చూపులు కన్నావా!

శిథిలమైన దుఃఖపు శిలాజాల
కాలాన్ని గుర్తించగలిగావా!

దిగులు బరువుతో
మనశ్శయ్య కుంగడం గమనించావా!

Pages