S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 16:04

న్యూఢిల్లి: దేశంలో అసహనం పెరిగిపోతోందని, ఇక్కడ జీవించడం కష్టమని, భద్రత లేదని, ఒకదశలో దేశం విడిచివెళ్లిపోవాలనుకుంటున్నట్లు ఆ మధ్య వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను ఉద్దేశిస్తూ రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘అలాంటి వాళ్లకు ఓ పాఠం నేర్పాలి’ అన్న పారికర్ వ్యాఖ్యలు బెదరించేవిగా ఉన్నాయని కాంగ్రెస్ మండిపడింది.

07/31/2016 - 16:04

శ్రీనగర్:కాశ్మీర్ ఇప్పటికీ రగులుతూనే ఉంది. పెద్దలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని చిన్నారులు దాడులకు పాల్పడుతున్నారు. ముసుగు ధరించిన 15 సంవత్సరాల లోపు చిన్నారులు రాళ్లు, వస్తువులతో దాడికి పాల్పడుతున్నారని, వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ విధ్వంసం సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్ సమస్యకు ఇదా పరిష్కారమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

07/31/2016 - 16:02

లక్నో:ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో కారులో వెడుతున్న ఇద్దరు మహిళలను బయటకు లాగి, నగదు, నగలు దోచుకున్న కొందరు దుండగులు వారిపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో స్వగ్రామానికి వెళుతున్నవారిని అటకాయించిన దుండగులు మగవారిని చెట్టుకట్టి బెదరించారు. ఓ మహిళ, ఆమె 14 ఏళ్ల కుమార్తెను బెదరించి నగరు దోచుకున్నారు. ఆ తరువాత వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

07/31/2016 - 15:45

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రం చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. 14వ ఆర్థికసంఘం సిఫారసుల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న కేంద్రమంత్రి జైట్లీ వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. కేంద్రం హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఇది రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అని ఆయన అన్నారు.

07/31/2016 - 15:44

న్యూఢిల్లి:ఆరోగ్యంపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, యాంటీబయాటిక్స్ వాడకంలో జాగ్రత్తలు అవసరమని, మోతాదుకు మించి, అవసరానికి తప్ప వాడకూడదని హితవు చెప్పారు. ఆదివారం ఆయన మన్‌కీబాత్ కార్యక్రమంలో మాట్లాడారు. రియో ఒలింపిక్స్‌కు వెడుతున్న క్రీడాకారులకు అభినందనలు చెప్పారు. దేశప్రజలుకూడా నరేంద్రమోదీ యాప్‌ద్వారా వారికి శుభాకాంక్షలు తెలపాలని కోరారు.

07/31/2016 - 15:44

భీవండి:మహారాష్టల్రోని భీవండిలో రెండతస్తుల భవనం కూలిన సంఘటనలో ఆరుగురు మరణించారు. మరో 30మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

07/31/2016 - 15:43

న్యూఢిల్లి:2020 ఒలింపిక్స్‌కు ఇండియాలో ప్రతి జిల్లానుంచి ఒక అథ్లెట్ పాల్గొనేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని, మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే రియో ఒలింపిక్స్‌కు హాజరవుతున్న క్రీడాకారులకు అభినందనలు తెలపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. క్రీడారంగంలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు యువత నడుంబిగించాలని ఆయన అన్నారు.

07/31/2016 - 15:42

సొమాలియా:దేశ రాజధాని మొగదిషులో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. నగరంలోని సిఐడి కార్యాలయంలో బాంబులు అమర్చిన కారుతో దూసుకొచ్చిన దుండగులు ఆత్మాహుతికి పాల్పడ్డారు. భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు ప్రాథమిక సమాచారం.

07/31/2016 - 15:42

యాదగిరిగుట్ట:రాష్ట్ర భారీ నీటివనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు దంపతులు ఆదివారం నాడు యాదగిరిగుట్టకు విచ్చేశారు. వారికి ఆలయ సిబ్బంది, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

07/31/2016 - 15:41

హైదరాబాద్:మాజీప్రధాని దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్ నటించిన ‘జాగ్వార్’ సినిమా టీజర్ విడుదలైంది. థమన్, రామజోగయ్యశాస్ర్తీ, విజయేంద్రప్రసాద్ తదితరులు పనిచేసిన ఈ చిత్రంతో నిఖిల్ సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

Pages