S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా తొగాపూర్ పంచాయతీ పందిరి హన్మన్పల్లిలో శుక్రవారం విద్యుత్ కంచె తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించిన సంఘటన జరిగింది. తుడుము వెంకటయ్య తన జొన్న పంట అడవి పందుల బారిన పడకుండా వేసిన విద్యుత్ కంచె తగిలి తాను పెంచుకుంటున్న కుక్క మరణించింది. కుక్కని చూసేందుకు వెళ్లిన వెంకటయ్య అనుకోకుండా తీగను పట్టుకొని విద్యుదాఘాతానికి గురై మరణించాడు.
దిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ను లెఫ్టినెంట్గా ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ ఎస్ సుగాగ్ నియమించారు. చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కనేవాడిని, ఇప్పుడు లెఫ్టినెంట్ హోదాలో నా దేశ ప్రజలకు సేవ చేస్తా అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి వూమెన్చాందీ కొల్లం నుండి తిరువనంతపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత బస్సులో ప్రయాణిస్తున్నానని చాందీ తెలిపారు. తనకు బస్సులో ప్రయాణించడమంటే ఎంతో ఇష్టమని కానీ ముఖ్యమంత్రి పదవి వల్ల అది కుదర్లేదన్నారు. కారులో వెళ్లే అవకాశం ఉన్నా తిరస్కరించి బస్సులో వెళ్లారు.
పట్నా: బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బహిష్కృత భాజపా నేత దయాశంకర్ సింగ్ను బిహార్లోని బక్సర్లో పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కేసు నమోదైన అనంతరం దయాశంకర్ పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారు. ఝార్ఖండ్లోని ఆలయంలో ఆయన దిగిన ఫొటోలు బయటకు రావడంతో పోలీసులు ముమ్ముర గాలింపు చేపట్టి బిహార్లో అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : మెదక్ జిల్లా సరిహద్దుకు ప్రతిపక్ష నేతలు వెళ్తే అరెస్ట్ చేస్తున్నారు... మెదక్ జిల్లా ఏమైనా నిషేధిత ప్రాంతమా? అని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలకు ప్రతిపక్ష నేతలు వెళ్తే వాస్తవాలు బయటపడతాయని టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందని, జానారెడ్డి, షబ్బీర్ అలీని అరెస్ట్ చేసి తిప్పడం దౌర్జన్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
వరంగల్ : ఎంసెట్-2 పేపర్ లీకేజీపై వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో శుక్రవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్కు చెందిన అవినాష్ అనే విద్యార్థి ఇంటికి సీఐడీ అధికారులు రాగా తాళం వేసి ఉండడాన్ని గుర్తించారు. వరంగల్ జిల్లాలోని పరకాల, భూపాలపల్లికి చెందిన 11 మంది విద్యార్థులకు ఎంసెట్-2 పేపర్ అందినట్టు సీఐడీ అధికారులు నిర్ధారించారు.
హైదరాబాద్: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీపై సీఐడీ నివేదిక సమర్పించనుంది. డీజీపీ అనురాగ్శర్మ, సీఐడీ డీజీ సత్యనారాయణ ముఖ్యమంత్రిని కలిసి నివేదిక సమర్పించనున్నారు. నివేదికను సమీక్షించిన తర్వాత ఎంసెట్-2 రద్దుపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నూజివీడు మండలం సుంకొల్లులో వనం-మనం కార్యక్రమంలో పాల్గొని ఔషధ, రావి, వేప మొక్కలు నాటారు. రాష్ట్రంలో శుక్రవారం ఒక్క రోజే కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి నిర్దేశించడంతో అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు.
పుణె : నిర్మాణంలో ఉన్న ఓ భవనం శుక్రవారం కూలిపోవడంతో పుణెలో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
హైదరాబాద్: ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని కోరుతూ ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులు బంజారాహిల్స్లోని మంత్రుల నివాసాలను శుక్రవారం ముట్టడించారు. పేపర్ లీక్కు సంబంధించి మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను వెంటనే బర్త్ఫ్ చేయాలని, లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నినాదాలు చేశారు.