S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెదక్: లాఠీచార్జిలో గాయపడిన మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను పరామర్శించేందుకు మెదక్ బయలుదేరిన కాంగ్రెస్ నేతలను మంగళవారం నాడ గజ్వేల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ ముందస్తు అరెస్టులు చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో కాంగ్రెస్ నేతలు డికె అరుణ, దామోదర రాజనరసింహ, అద్దంకి దయాకర్, శ్రవణ్ తదితరులున్నారు.
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులకు ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ‘మణిపూర్ ఉక్కుమహిళ’ షర్మిల తన ఆందోళనకు స్వస్తి చెప్పబోతున్నారు. ఆగస్టు9న నిరాహార దీక్షను ముగిస్తానని ఆమె మంగళవారం ఇక్కడ ప్రకటించారు. ఇక తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె తెలిపారు. ముక్కుకు అమర్చిన పైపుద్వారా అందించే ద్రవ పదార్థాలతో ఇన్నాళ్లూ ఆమె జీవిస్తున్నారు.
విశాఖ : మిస్సయిన విమానం జాడ కనుగొనే ప్రయత్నంలో నారింజరంగులో ఉన్న రెండు డ్రమ్ములను బంగాళాఖాతంలో ఎయిర్ఫోర్స్, నావీ సిబ్బంది గుర్తించారు. ఈ డ్రమ్ములు కూలిపోయిన విమానానికి సంబంధించినవిగా అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ డ్రమ్ములు ఆ విమానంకు చెందినవిగా అధికారికంగా ప్రకటించలేదు. నాలుగు రోజుల కిత్రం చెన్నై నుంచి పోర్ట్బ్లెయిర్కు బయలుదేరిన విమానం తప్పిపోయిన విషయం తెలిసిందే.
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం సిఫారుసుల అమలుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పెంచిన వేతనాలను ఆగస్టు నుంచి అందుకుంటారు. బేసిక్, పెన్షన్ పెంపునకు సంబంధించి 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
ముంబై : దుబాయ్ నుంచి మాల్దీవులు వెళ్తున్న విమానంలో పొగలు రావడంతో పైలెట్ విమానాన్ని అత్యవసరంగా
మంగళవారం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. విమానంలో ఉన్న350 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కర్నూలు: పాణ్యం రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం ఇద్దరు యువకులను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి మృతదేహాలను పొలాల్లో పడేశారు. మృతులను కొలిమిగుండ్ల మండలం బోయఉప్పలపాడు గ్రామానికి దారా లక్ష్మయ్య, దారా ఓబులేశుగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: నగరంలో పట్టుబడ్డ ఐసిస్ తీవ్రవాదులకు ఆగస్టు 24 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. జైల్లో ఉన్న ఏడుగురు నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం విచారించింది.
మంబయి: పుణెకు చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పుణె-మంబయి రహదారిలో బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోగా, ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మొగాదిషు: సొమాలియా రాజధాని మొగాదిషు సమీపంలో మంగళవారం ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 8మంది పౌరులు మృతి చెందారు. కారు బాంబుతో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో భారీ పేలుడు సంభవించింది.దాడికి పాల్పడింది తామేనని అల్ షబీబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
హైదరాబాద్ : రుతు పవనాల ప్రభావంతో గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిన తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.