S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, డిసెంబర్ 7: ఇంగ్లాండ్తో రాజ్కోట్లో జరిగిన మొదటి క్రికెట్ టెస్టులో కొంత తడబడి, డ్రాతో బయటపడినా, ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ప్రత్యర్థిని చిత్తుచేసిన టీమిండియా గురువారం నుంచి ఇక్కడ మొదలుకానున్న నాలుగో టెస్టుపై కనే్నసింది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ టెస్టును గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ను సొంతం చేసుకుంటుంది.
ముంబయి: ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడిన పార్థీవ్ పటేల్ ఇంగ్లాండ్తో గురువారం నుంచి మొదలయ్యే నాలుగో టెస్టులో కీపింగ్కు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టులకు గుడ్బై చెప్పిన తర్వాత రెగ్యులర్ వికెట్కీపర్గా తన స్థానాన్ని పదిలం చేసుకున్న వృద్ధిమాన్ సాహా గాయపడడంతో పార్థీవ్ జట్టులోకి వచ్చాడు.
ముంబయి: భారత బ్యాట్స్మన్ ఆజింక్య రహానే గాయం కారణంగా ఇంగ్లాండ్తో జరిగే చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. జట్టు ప్రాక్టీస్ సెషన్లో అతని కుడి చూపుడు వేలుగు గాయమైంది. దీనితో అతను మిగతా రెండు టెస్టుల్లో ఆడే అవకాశం లేదని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతని స్థానంలో జట్టులోకి మనీష్ పాండేను తీసుకున్నట్టు పేర్కొంది. కొంతకాలంగా రహానే ఫామ్లో లేకపోవడం అభిమానులను వేధిస్తున్నది.
లక్నో, డిసెంబర్ 7: స్వదేశంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న 11వ ఎఫ్ఐహెచ్ జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్షిప్లో భారత జట్టు టైటిల్పై గురిపెట్టి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. 2001లో హోబర్ట్ (ఆస్ట్రేలియా)లో భారత్ చివరిసారి ఈ టోర్నీలో టైటిల్ను కైవసం చేసుకుంది.
ముంబయి: ఇంగ్లాండ్ కెప్టెన్ అలస్టర్ కుక్పై ఒత్తిడి తీవ్రమవుతున్నది. వరుసగా రెండు మ్యాచ్లు చేజార్చుకొని, సిరీస్ను కోల్పోయే ప్రమాదంలో పడిన జట్టు పరువు నిలవాలంటే చివరి రెండు టెస్టుల్లోనూ గెలిచి తీరాలి. భారత్లో టీమిండియాను ఓడించడం అనుకున్నంత సులభం కాదన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో ముంబయి టెస్టును గెలవడం మినహా ఇంగ్లాండ్ ముందు మరో ప్రత్యమ్నాయం లేదు. ఈ విషయం కుక్కు తెలియందికాదు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే చివరి రెండు టెస్టులకు నిధుల కొరత ఏర్పడుతుందేమోన్న ఆందోళన నుంచి బిసిసిఐ బయటపడింది. ఈ మ్యాచ్లను నిర్వహించే సభ్య సంఘాలకు నిధులు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతినివ్వడంతో ఊపిరి పీల్చుకుంది.
న్యూయార్క్, డిసెంబర్ 7: గత మూడు సీజన్లు తనకు కోచ్గా వ్యవహరించిన మాజీ ప్రపంచ నంబర్ వన్ బోరిస్ బెక్తో నొవాక్ జొకోవిచ్ తెగతెంపులు చేసుకున్నాడు. బెకర్ కోచ్గా ఉన్న సమయంలోనే జొకోవిచ్ ఆరు మేజర్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఇకపై బెకర్ తనకు కోచ్గా ఉండడం లేదని జొకోవిచ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. విడిపోదామన్నది తమ ఇద్దరి సమష్టి నిర్ణయమని ప్రకటించాడు.
గౌహతి, డిసెంబర్ 7: చాలాసార్లు వాయిదా పడిన జాతీయ పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్ ఎట్టకేలకు గురువారం నుంచి మొదలుకానుంది. ఈ పోటీల్లో ఒలింపియన్లు మనోజ్ కుమార్, శివ థాపా తమతమ విభాగాల నుంచి కాకుండా ఇతర విభాగాల నుంచి పోటీపడతారు. ఇప్పటి వరకూ 64 కిలోల విభాగంలో ఫైట్స్ చేస్తున్న మనోజ్ 69 కిలోల వెల్టర్వెయిట్ విభాగం నుంచి రింగ్లోకి దిగుతాడు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సుమారు మూడు దశాబ్దాలుగా పురుషుల బాక్సింగ్ రంగానికి వివిధ హోదాల్లో సేవలు అందిస్తూ, ప్రస్తుతం కోచ్గా ఉన్న గుర్బాక్స్ సింగ్ సంధూ ఇకపై మహిళలకు కూడా కోచ్గా వ్యవహరిస్తాడు. ఇటీవలే ఏర్పడిన భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్ఐ) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇస్తే చాలు తల్లిదండ్రుల్లో అలజడి పుడుతోంది. స్నేహితులతో సరదాగా సెలవురోజులు గడుపుదామని విద్యార్థులు చెరువులు, నదుల వద్దకు, బీచ్ల వద్దకు వెళుతూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. ఈత రాక మరణిస్తున్న యువకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సెల్ఫీల మోజుతో కొందరు మృత్యువాత పడుతున్నారు.